తిరుపతిలోని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై రూ.50 లక్షలు జరిమానా విధించినట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జరిమానాలు చెల్లించకపోతే కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే డీఎస్సీని ఏపీపీఎస్సీకి అప్పగించాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే విశాఖపట్టణంలో ఈనెల 16వతేదీ నుంచి ఇంటర్నేషనల్ టెక్ సదస్సు జరగనుందని, మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని మంత్రి తెలిపారు.