గన్నవరం ఎయిర్పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వతేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం 1.30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొననున్నారు.