>అమరావతి:సచివాలయంలో సీఆర్డీఏ ఉన్నతాధికారులతో రాజధాని డిజైన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధుల బృందం శాసనసభ డిజైన్ల ప్రజెంటేషన్ ఇచ్చింది. సన్రైజ్ స్టేట్ చిహ్నంగా భవనాలపై ఉదయించే సూర్యుని గుర్తు, పురాతన నాణేలు, రాచరిక చిహ్నాలు, పూర్ణకుంభం, నెమలి ఈక వంటి చిత్రాలను పరిశోధించి నార్మన్ ఫోస్టర్ బృందానికి అందించామని రాజమౌళి తెలిపారు.