కేరళ: ఓఖీ తుఫాను బీభత్సంలో ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైన బాధితుల సహాయం కోసం కేరళ కేబినెట్ సభ్యులు నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఓఖీ సైక్లోన్ రిలీఫ్ ఫండ్కు కేబినెట్ సభ్యులు తమ నెలజీతాన్ని విరాళంగా అందజేశారు. ఇటీవలే కేరళ, తమిళనాడు, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఓఖీ బీభత్సం ధాటికి 50మందికిపైగా ప్రాణాలు కోల్పోగా..వందలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.