చంద్రన్న విలేజ్ మాల్స్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈరోజిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రన్న విలేజ్ మాల్స్పై ఆమె విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్న చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. పేదవాడికి విలేజ్మాల్స్తో ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. రేషన్ షాపు నుంచి 9 రకాల సరుకులను ఎందుకు తీసేశారని?, రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆమె ప్రశ్నించారు.