విజయవాడ తరహాలోనే అన్ని పాఠశాలల్లో ఆధునిక మరుగుదొడ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ అన్నారు. మొగల్రాజపురంలోని బీఎస్ఆర్కే పురపాలక పాఠశాలలో ఆధునిక మరుగుదొడ్లను ప్రారంభించిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. పురపాలక పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుల్లో ప్రస్తుతం 50 వేల మంది ఉన్నారన్నారు. కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా పురపాలక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తారన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ప్రీ స్కూళ్ల ఏర్పాటుకు మంచి ఆదరణ లభించిందన్నారు.