హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే ప్యారడైజ్ బిర్యానీని రుచి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్లలేరు. తాజాగా, ఈ బిర్యానీ విజయవాడవాసులకు అందుబాటులోకి వచ్చింది. నిన్న ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీంపంలో మొదటి ఔట్ లెట్ ను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సీఈవో గౌతమ్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ బిర్యానీ ద్వారా విజయవాడవాసుల మనసులను చూరగొనడమే తమ లక్ష్యమని చెప్పారు. రుచికి, శుచికి తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలా తమ మెనూ ఉంటుందని చెప్పారు.