తిరుపతి : మంత్రి పరిటాల సునీత ఇవాళ తిరుపతిలో పర్యటించారు. మహిళా ప్రాంగణంలో కుట్టుశిక్షణ పొందిన మహిళలకు తిరుపతిలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మొత్తం 122 మంది మహిళలు కుట్టుమిషన్లను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆదుకొనేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీతతో పాటు అమరనాథ్రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, కలెక్టర్ ప్రద్యుమ్న లు పాల్గొన్నారు.