అమరావతి రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ కు సంబందించిన హౌసింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీఆర్డీయే అధికారులతో కలసి ఆయన లింగాయపాలెం, రాయపూడి, నేలపాడు తదితర ప్రాంతాలలోని ఆయా ప్రాజెక్టులను సందర్శించి పనుల వివరాలను కాంట్రాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వేల 840 ఫ్లాట్ లకు సంబందించిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. 15 నెలల్లో గృహ నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు సైతం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.