ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమి భయంతోనే మోదీ ఆరోపణలు : ఆనంద్ శర్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 01:27 PM

న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారని మోదీ చేసిన వ్యాఖ్యలను శర్మ ఖండించారు. మోదీకి ఓటమి భయం పట్టుకున్నందుకే.. రెండో దశ పోలింగ్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. మోదీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. గుజరాత్‌లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఓ వివాహ వేడుకకు మాత్రమే హాజరయ్యారని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇంత మాత్రాన.. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటోందని అనడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నేతలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com