న్యూఢిల్లీ : ఢిల్లీలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పార్క్ స్ట్రీట్లో తనిఖీలు చేశారు. అక్కడున్న ఓ నైట్ క్లబ్లో 2.5 కేజీల గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.