అనంతపురం జిల్లాలో 32వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడేరులో రెండు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్లను జగన్ ప్రారంభించారు. జగన్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు.