అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి ప్రారంభించిన జగన్ తన 32వ రోజు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ను ప్రజలు కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. పాదయాత్రలో తలుపూరు వద్ద జగన్కు ఘన స్వాగతం లభించింది. గ్రామంలోకి అడుగు పెట్టిన జగన్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు.