గండికోట రిజర్వాయర్కు 6వేల క్యూసెక్కుల నీటి సరఫరా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్లో నీటిని అందించి నాట్లకు వెళ్లడంతో ఈ ఖరీఫ్లో అధిక దిగుబడి సాధ్యమైందన్నారు. తుఫాన్ల బారి నుంచి పంటల్ని కాపాడుకోవడమే కాకుండా రైతులు అధిక దిగుబడిని పొందగలిగారన్నారు. రాబోయే ఖరీఫ్ సేద్యానికి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని సీఎం సూచించారు.నకిలీ విత్తనాలను తయారు చేసేవారు, వాటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే అనంతపురంలో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లంపులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.