విశాఖ అరకు మీదుగా రైళ్ల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి. అరకు సమీపంలో దెబ్బతిన్న వంతెన పిల్లర్ ను కేవలం 58 రోజుల్లో తూర్పు కోస్తా రైల్వే అధికారులు మరమ్మతులు చేశారు. దీంతో సాయంత్రం కేకే లైన్ లో జగదల్ పూర్ ఎక్స్ ప్రెస్ ప్రయాణించనుంది. అలాగే రేపటి నుంచి విశాఖ- కిరండోల్ మధ్య ప్యాసింజర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.