అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఉదయం శింగనమల నియోజకవర్గం మార్తాడ్ నుంచి ప్రారంభమైన జగన్ 31వ రోజు పాదయాత్ర కోటంక మీదుగా కమ్మూరు గ్రామానికి చేరుకుంది. కమ్మూరులో జగన్కు ఘన స్వాగతం లభించింది. జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జగన్కు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. పాదయాత్రలో జగన్తో కలిసి మహిళలు అడుగులు వేశారు.