సోనిట్పూర్ : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి చెందిన సంఘటన అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. గుహవాటి - నాహర్లాగున్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఏనుగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరు ఏనుగుల్లో ఒక పిల్ల ఏనుగు ఉంది. ఏనుగుల మృతదేహాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2013 - 2016 మధ్యకాలంలో అసోంలో 140 ఏనుగులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.