విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సీతన్నపేట గేట్ సెంటర్ సమీపంలోని వంతెన వద్ద జరిగింది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సీతన్నపేట గేట్ సెంటర్ సమీపంలోని వంతెన వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపుతప్పి వంతెన గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రయాణికులు భయాంతో బస్సు అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకారు. బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయలో బస్సులో ఉన్న 40 ప్రయాణికులు ఉన్నారు. వీరిని మరో బస్సులో హైదరాబాద్కు తరలించారు.