తిరుపతి: తిరుమల శ్రీవారిని సినీనటుడు నాని దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో నాని సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. తన కుమారుడు అర్జున్ తో కలిసి మొదటి సారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాని ఈ సందర్భంగా తెలిపారు.