తమిళనాడులోని ఆర్.కె నగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే, శశివర్గం అభ్యర్థులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమ్మ వారసులం తామేనంటూ ఆయన గల్లీ గల్లీ లో క్యాంపెయిన్ చేపట్టారు. ఈ నెల 21 న ఆర్.కె నగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.