భారత్-శ్రీలంక మధ్య రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ధర్మశాలలో జరగనుంది. ఈ వన్డేకు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఆదివారం ఉదయం 11.30గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. బీసీసీఐ సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో టీమిండియా సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం స్థానిక వాతావరణశాఖ అధికారులు 10, 11, 12, 13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. అందులో ధర్మశాల కూడా ఉందట. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కూడా ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు.
దీనిపై హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్పీసీఏ) మీడియా ప్రతినిధి మోహిత్ సూద్ మాట్లాడుతూ.. ‘వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. సిబ్బంది సిద్ధంగానే ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవరసం లేదు’ అని తెలిపారు.