ఒంగోలు: పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాలు చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పడవ ప్రమాద బాధితులతో పవన్ సమావేశమై మాట్లాడారు. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందన్నారు. నిందితులు తప్పించుకుని తిరగడం అసలుసిసలైన విషాదం అన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.