ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ బీచ్రోడ్డులో ఏయూ పూర్వ విద్యార్థుల సమాఖ్య సందర్భంగా వాకథాన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించారు. వాకథాన్లో పెద్ద ఎత్తున ఏయూ విద్యార్థులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా విశాఖలో జరిగే ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెంకయ్య పాల్గొననున్నారు. అలాగే ఏయూ కన్వెన్షన్ సెంటర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభించనున్నారు.