ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ పబ్లిసిటీ ఖర్చు రూ.3755 కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 09:43 AM

 మోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే స్టన్ కావాల్సిందే. సుమారు రూ.3755 కోట్లు కేవలం ప్రచారం కోసం మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిందట. సమాచార హక్కు చట్టం కింద వేసిన ప్రశ్నకు శుక్రవారం ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. ఏప్రిల్ 2014 నుంచి అక్టోబర్ 2017 వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం రూ.37,54,06,23,616 ఖర్చు చేసినట్లు తేలింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రేటర్ నోయిడాకు చెందిన సామాజిక కార్యకర్త రామ్‌వీర్ తన్వార్ వేసిన ఆర్టీఐ ఫిర్యాదుకు ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్‌ల కోసమే సుమారు రూ.1656 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రేడియో, డిజిటల్ సినిమా, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్, టీవీలు ఉన్నాయి. ఇక ప్రింట్ మీడియా కోసం రూ.1698 కోట్లు ఖర్చు చేశారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com