వివాదాలను పక్కదోవ పట్టించేందుకే మంత్రి లోకేష్ ఆస్తుల ప్రకటన విడుదల చేశారని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ…. ఆస్తుల వివరాలు స్పీకర్ కు సీల్డ్ కవర్ లో ఇస్తారన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఆస్తుల వివరాలను ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. డిసెంబర్ 8ని అసత్య దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తులకు డబుల్ ఇస్తే రాసిస్తారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు సంబంధించిన ఆస్తుల కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు. పవన్ మూడు రోజులు ఆంధ్రా ప్రజలకు కాల్షీట్లు ఇచ్చాడన్నారు. ఎన్నికల్లో మద్దతిచ్చిన వ్యక్తే పోలవరంపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు… ప్రభుత్వం ముందు దానికి సమాధానం చెప్పాలన్నారు.