పవన్ కల్యాణ్ తన విజయవాడ పర్యటనలో ఏపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యలను అర్ధం చేసుకునే వ్యక్తి గనుకనే ఆయనకు మద్దతు ఇచ్చానని చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నందువల్లనే ఆయను, ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. అదే సమయంలో దీనిని తన చేతగాని తనంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అలాగే డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు పోవడం తగదని ఏపీ సర్కార్ కు సూచించారు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వేస్టేనని చురకంటించారు. రాష్ట్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాననీ, అన్ని సమస్యలపైనా పోరాడుతానని పవన్ అన్నారు.