ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతన్నల కష్టంపై జగన్‌కు ఏ మాత్రం అవగాహన లేదు : మంత్రి సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 02:35 PM

కడప : జగన్‌కు కేవలం సీఎం కుర్చీపై ఆశతో కళ్లు మూసుకుపోయి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయాడని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ రోజు కడప ఆర్‌అం డ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సోమిరెడ్డి మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడకుండా రైతులు సుఖంగా ఉండకూడదన్నదే జగన్‌ లక్ష్యమని, రైతన్నలు సుఖంగా ఉంటే ఆయనకు కంటిపై కునుకుండదని, అతనికి రైతుల కష్టంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆగిపోవాలన్నదే జగన్‌ ఆకాంక్ష అని యద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com