ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్ ఎన్నికల్లో వెంకయ్య లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 12:52 PM

వెంకయ్య నాయుడు ఈ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది అయన మాట తీరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే నాయకుడు వెంకయ్య నాయుడు. ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆ భాషకు చెందిన వాడిగా భావిస్తుంటారు ప్రజలు. దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన మీటింగ్ ఉండాల్సిందే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు ఈయన పేరు మారుమోగేది. కానీ ప్రస్తుతం ఈయన పేరు వినపడటం లేదు. ఎందుకంటే వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నారు. అయితే ఇప్పుడు వెంకయ్య లేని లోటు గుజరాత్ లో స్పష్టంగా కనిపిస్తుంది.


మోడీ మీద మాట పడనియకుండా ఎంతటి వారినైనా తన వాక్ చాతుర్యంతో మట్టి కరిపించే వెంకయ్య లేకపోవడంతో గుజరాత్ సభలలో కాసింత లోటు కనిపిస్తుంది. అదే ఇప్పుడు వెంకయ్య ప్రత్యేక్ష రాజకీయాలలో ఉన్నట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తన స్పీచ్ లతో దంచికొట్టేవారు. బీజేపీ పై విమర్శలు చేసేవారి పుట్టుపూర్వత్రాలు తీసి మరి వారి తీరును ఎండగట్టే వారు. పార్టీని మోడీని విమర్శించిన వ్యక్తుల చరిత్రను మొత్తం చేతి వేళ్ళపై లెక్కేసి వారి లెక్కలు వారి బొక్కలు చెప్పేవారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com