గాంధీనగర్ : గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా ఓ పూజారి ప్రచారం చేస్తున్నాడు. దీంతో పూజారిపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటన జునాఘడ్లో చోటు చేసుకుంది. గాయపడిన పూజారి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడిని స్వామినారాయణ్ గురుకుల్లో పూజారిగా పని చేస్తున్న స్వామి భక్తిప్రసాద్గా పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడి చేశారని భక్తి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ శనివారం జరగనుంది.