న్యూఢిల్లి : పవిత్రమైన బ్రహ్మపుత్రానది బురదతో నిండిపోయి నల్లబడిపోవడానికి కారణాన్ని అన్వేషిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఖచ్చితమైన సమాచారం తెలుసుకున్న తరువాతే దీని గురించి తాను మాట్లాడుతానని ఆయన అన్నారు. బ్రహ్మపుత్ర ప్రవాహ తీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని ఆయన అన్నారు. మెక్మోహన్ రేఖ దాటిన తరువాతనుంచి నది నల్లగా మారడానికి కారణాలు తెలుసుకుంటామని, ప్రజల ఆందోళన అర్థం చేసుకున్నామని ఆయన చెప్పారు. బ్రహ్మపుత్ర నది నల్లగా మారిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.