కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్కు మానసిక స్థితి సరిగ్గా లేదని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని నీచ్ ఆద్మీ అంటూ వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్ను లాలూ తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ పేరిట ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ జాతి నిర్మాణంలో అంబేద్కర్ పాత్రను చరిత్రనుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఒక సభలో మోడీ పేర్కొనడంపై మణిశంకర్ అయ్యర్ స్పందిస్తూ మోడీని నీచ్ ఆద్మీ అని, కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై అన్ని పార్టీల నేతలు మణిశంకర్ అయ్యర్ను తప్పుబట్టారు.