మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టాటా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.