చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి-చింతూరు ఘాట్రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ప్రమాదవశాత్తు లోయలోపడిపోయింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చింతూరు ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 12మంది ఉన్నారు. వీరంతా క్రైస్తవ సభలకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు బాధితులను ఆస్పత్రికి తరలించారు.