విశాఖ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న రాష్ట్రపతికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనస్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమాల అనంతరం ఆయన 2.40 నుంచి 3.40 గంటల వరకు అక్కడున్న రాష్ట్రపతి సూట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం బీచ్ రోడ్లోని టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణానికి చేరుకుంటారు.