ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేసిన సమయంలో నిస్సహాయుడిని :పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:31 PM

రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాకే సినిమాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేహానికి రక్తం ఎలాగో జనసేనకు కార్యకర్తలు అలాగని అన్నారు. శుచి, శుభ్రత లేకుండా దేవాలయాలకు వెళ్లకూడదో.. ఆలోచన, శుచి లేకుండా రాజకీయాల్లోకి రాకూడదన్నారు. తన వృత్తి సినిమాలు అయితే.. ప్రవృత్తి రాజకీయం అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా పని చేయొచ్చు.. ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చన్నారు. పీఆర్పీ ఫెయిల్యూర్ కి కొందరి ద్రోహమే కారణమని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. చిరంజీవికి కొందరు ద్రోహం చేయకుంటే ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారని పవన్ అన్నారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల భేటీలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో తాను నిస్సహాయుడినని పవన్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com