నేను చిరంజీవిలా మెతక వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో మాట్లాడిన ఆయన ..చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని కానీ నేను ఆయనలాంటి వాడ్ని కాదని అన్నారు. నన్ను కులానికి అంటగట్టినా కులనాయకుడిగా చిత్రీకరించినా ఏ స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించన్న పవన్ మీ సంస్థల్లో ఆఫీస్ బోయ్ నుంచి మేనేజర్ స్థాయి వరకు కులాల లెక్కలు తీస్తానని హెచ్చరించారు. నాకు కులం లేదని నేను భారతీయుడినని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విపక్షానికి చిత్తశుద్ధిలేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. విపక్షానికి గనుక చిత్తశుద్ధి ఉంటే అధికార పక్షానికి ఊపిరాడకుండా చేయవచ్చని అన్నారు. ప్రభుత్వం హామీలను విస్మరించినప్పుడు, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నప్పుడు జనసేనానిగా తన గళాన్నివిప్పుతానని పవన్ పేర్కొన్నారు. తనకు కులాన్ని అంటగట్టే వారెవరినైనా సరే ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.తనకు కులాన్ని ఆపాదించవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. తాను కాపును కానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను భారతీయుడినని ఉద్ఘాటించిన పవన్ అంతకంటే ముఖ్యంగా తను మనిషినని చెప్పారు. అన్ని కులాల లోనూతనకు అభిమానులున్నారని చెప్పారు. దేశంలో కుల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ను నిజంగా గౌరవిస్తే రాజకీయాల నుంచి కులాన్ని తీసేయాలని ఆన్నారు. కులాలను గౌరవిస్తాం కానీ వెనకేసుకురాం ఇది జనసేన విధానమని పవన్ కల్యాణ్ చెప్పారు.