ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:23 PM

రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులెవరూ జనసేనలో ఉండరని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లడడానికి తాను చాలా చిన్నవాడినని పేర్కొన్నారు. తాను రాజకీయంగా అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేనని చెప్పిన పవన్ తనకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లరనీ, ఉన్నా తాను తీసుకోనని చెప్పారు.  తన అన్న చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల వంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడగలిగారని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com