అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను ఆయన సమర్ధించారు. గత కొంత కాలంగా పోలవరం పనులు నెమ్మదించిన మాట వాస్తవమేనని చంద్రబాబు అన్నారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన జనసేన అధినేత మాటలను రాజకీయ విమర్శలుగా తీసుకోరాదని అన్నారు. కాంగ్రెస్, వైకాపాలు పోలవరం పూర్తి కాకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నాయని విమర్శించారు.