విజయవాడ: ఒకప్పుడు మనకంటే దక్షిణకొరియా పేద దేశమని, ప్రస్తుతం అభివృద్ధిలో దక్షిణకొరియా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజిక్కడ చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటన వివరాలను వెల్లడించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు సూన్ క్వోన్తో సమావేశమయ్యామన్నారు. ఎల్జీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిందన్నారు.