న్యూఢిల్లి : అయోధ్య వివాదానికి సంబంధించి తానెప్పుడూ సుప్రీంకోర్టులో సున్నీ వక్ఫ్బోర్డుకు ప్రాతినిధ్యం వహించలేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ చెప్పారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ వారికి కృతజ్ఞతలు చెప్పారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసే సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలని ఆయన కోరారు.