ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం గురించి పవన్ కల్యాణ్ ఏనాడైనా మాట్లాడారా?: ఎమ్మెల్యే రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 11:34 AM

పోలవరం గురించి పవన్ కల్యాణ్ ఏనాడైనా మాట్లాడారా?, ప్రభుత్వం, టీడీపీ ఇబ్బంది పడుతుంటే పవన్ కల్యాణ్ తెరపైకి వస్తారు.వారసత్వ రాజకీయాలపై మాట్లాడే హక్కు ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు లేదని సినీ నటి, నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాలకంటే ముందు పవన్ కల్యాణ్ వారసత్వ సినిమాలపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ లేడని ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు ఏమైంది? ఎంతవరకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం లో చంద్రబాబు దిట్ట అని ఆమె చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ పాత్రలకు నంది అవార్డు ఇవ్వొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. టీడీపీ తరపున వాణీ విశ్వనాథ్ నిలబడితే ఆమెపై పోటీకి తాను సిద్ధమని రోజా ప్రకటించారు. చిరంజీవిని మోసం చేసింది పవన్‌ కల్యాణే, పవన్‌తో పాటు అల్లు అరవింద్ కూడా చిరంజీవిని మోసం చేశారు. చిరంజీవికి అన్యాయం చేసినందుకు పవన్ కల్యాణ్‌ ముందుగా తనను తాను శిక్షించుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com