చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి జాతీయరహదారిపై ఓ టూరిస్ట్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 9మంది అక్కడికక్కడే మృతి చెందగా.. ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారీగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.