విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మచిలీపట్నంకు 1200 కి.మీ దూరంలో ఆగ్నేయ దిశగా అల్పపీడనం కేంద్రీకృతమై... వాయువ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం అల్పపీడనం తీవ్రరూపం దాల్చి కోస్తా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీ, ఒడిశాలో వర్షాలు పడనున్నాయి. తర్వాతి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచిస్తున్నారు.