గుజరాత్ శాసనసభ తొలిదశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. ఈ ఎన్నికలను ప్రధాని మోడీ ప్రతిష్టకు, త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ నాయకత్వానికి మధ్య లిట్మస్ టెస్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 182 స్థానాలకుగాను తొలిదశలో 89 స్థానాల్లో పోటీ జరుగనున్నది. తొలిదశలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 977 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.