అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 29వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 29వ రోజు పాదయాత్రను శింగనమల నియోజకవర్గం కల్లుమడి నుంచి ప్రారంభించారు. గమ్మేపల్లిలో పార్టీ జెండాతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పాదయాత్ర కల్లుమడి మీదుగా గుమ్మేపల్లి వరకు కొనసాగనుంది.