రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం విశాఖకు రానున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వస్తున్న ఆయన రెండు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
నేటి కార్యక్రమాలు: బీ భారతీయ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం 2..20 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు రాష్ట్రపతి చేరుకుంటారు. స్వాగత కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు అక్కడున్న రాష్ట్రపతి సూట్లో మధ్యాహ్నం 3.40 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.
3.40 గంటలకు బయలుదేరి 4 గంటలకు బీచ్రోడ్డులోని టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణానికి వెళ్తారు. యుద్ధవిమాన మ్యూజియం ప్రారంభోత్సవం తర్వాత 4.15 గంటలకు బయలుదేరి బీచ్రోడ్డులోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహానికి నివాళి అర్పించనున్నారు.
4.30 గంటలకు రాష్ట్రపతి ఏయూ కాన్వొకేషన్ హాలుకు వెళ్లనున్నారు. ఇక్కడ 5.10 గంటల వరకూ ఉండనున్నారు. ఈ-క్లాస్ రూమ్ భవన సముదాయం, ఇంక్యుబేటర్ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ప్రసంగించనున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్లు హాజరవనున్నారు.
ఏయూ నుంచి 5.10 గంటలకు బయలుదేరి ప్రాంతీయ నేత్ర వైద్యశాల సమీపంలోని బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ స్కూల్కు 5.15 గంటలకు వెళ్లనున్నారు. అక్కడ 15 నిమిషాలు గడపనున్నారు.
5.30 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ చోళాలోని ప్రెసిడెన్షియల్ సూట్కు 5.55 గంటలకు చేరుకోనున్నారు. అక్కడ రాత్రి 7.58 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.
విశ్రాంతి అనంతరం రాత్రి 8 గంటలకు ఈఎన్సీ మెస్లాన్స్కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడ ఐఎన్ఎస్ కల్వరిపై ముద్రించిన స్టాంపును విడుదల చేస్తారు. తదుపరి నౌకాదళం ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, రాత్రి 9.10గంటలకు ఐఎన్ఎస్ చోళాలోని ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు.