అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 28వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 28వ రోజు పాదయాత్రను కొట్టాలపల్లి నుంచి ప్రారంభించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్ర కొట్టాలపల్లి సెంటర్, నాగాలపురం క్రాస్, గంజ్కుంటపల్లి, చిట్టూరుల మీదుగా తరిమెల వరకు కొనసాగనుంది.