న్యూఢిల్లి :జనతాదళ్ యునైటెడ్ (జెడియు) తరఫున రాజ్యసభకు ఎన్నికైన శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. జెడియు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు శరద్ యాదవ్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. శరద్ యాదవ్ను రాజ్యసభకు ఎన్నుకున్న రాజకీయపార్టీ జెడియు సభ్యత్వాన్ని ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారని, తద్వారా రాజ్యసభకు ఆయన అనర్హుడయ్యారని వెంకయ్యనాయుడు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే శరద్ యాదవ్తో కలిసిన జెడియు సభ్యుడు అలీ అన్వర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.