ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:53 AM

 2017+18 బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు


 -సంక్షేమం అభివృద్ధి సమతూకంగా బడ్జెట్‌  
-కేటాయింపులకు అవసరాలే కొలమానం


విజయవాడ, మేజర్‌న్యూస్‌: రానున్న బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరపాల్సిన కేటాయింపులపై ఆర్ధికశాఖ అధికా రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శు్రƒ వారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష జరిపారు. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదని, దీంతో ఆయా శాఖలు తమ అవసరాలకు తగ్గట్టు సమర్పించిన అంచనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వా లని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు ఉండాలని స్పష్టం చేశారు సంక్షేమం-అభివద్ధి సమతూకంగా బడ్జెట్‌ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరే షన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగా లను ప్రధానంగా ద ష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. రాష్ర్టంలో పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేలా తోడ్పాటు అందించేందుకు దోహదం చేయాలని అన్నారు. 2018 డిసెంబర్‌ నాటికి అన్నింటా స్పష్టమైన ఫలితాలు సాధించాలని లక్ష్యం నిర్ధేశించు కున్నందున ఇప్పుడు ప్రవేశ పెట్టే బడ్జెట్‌ చాలా కీలకం కానుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు వీలుగా ఏఏ శాఖలకు ఏమేరకు నిధులు అందించాలనే దానిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. యువత-మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌ చంద్ర, అజయ్‌ కల్లం, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com