న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ మొదటి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీతో అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. విజయ్ 51, కోహ్లీ 17 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ ధావన్ 23, పుజారా 23 రన్స్ చేసి ఔటయ్యారు. విజయ్ హాఫ్ సెంచరీలో ఏడు ఫోర్లు ఉన్నాయి. లంక బౌలర్లు గమగే, దిల్రువాన్ పెరీరాలు చెరో వికెట్ తీసుకున్నారు